గవర్నర్ కు నారా లోకేష్ లేఖ

ఆంధ్రప్రదేశ్ లో పదోతరగతి, ఇంటర్ పరీక్షలు రద్దు చేయాలని కోరుతూ టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ గవర్నర్ కు లేఖ రాశారు. ఈ పరీక్షలకు [more]

Update: 2021-04-27 00:59 GMT

ఆంధ్రప్రదేశ్ లో పదోతరగతి, ఇంటర్ పరీక్షలు రద్దు చేయాలని కోరుతూ టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ గవర్నర్ కు లేఖ రాశారు. ఈ పరీక్షలకు 16.3 లక్షల మంది హాజరుకావాల్సి ఉందని, అయితే కరోనా తీవ్రత ఎక్కువగా ఉన్నందున ఈ పరీక్షలను రద్దు చేయాలని నారా లోకేష్ గవర్నర్ కు రాసిన లేఖలో కోరారు. అనేక రాష్ట్రాలు పరీక్షలు రద్దు చేసిన విషయాన్ని లోకేష్ లేఖలో గుర్తు చేశారు. తాను చేపట్టిన ప్రజాభిప్రాయ సేకరణను లోకేష్ గవర్నర్ ముందు ఉంచారు.

Tags:    

Similar News