రఘురామరాజుకు నందిగం సురేష్ వార్నింగ్

వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణంరాజుపై పార్లమెంటు సభ్యుడు నందిగం సురేష్ మండిపడ్డారు. రఘురామ కృష‌్ణంరాజు కొన్ని పార్టీల చేతుల్లో పావుగా మారారన్నారు. ఆయనకు ధైర్యం ఉంటే ఏపీకి [more]

Update: 2021-04-08 00:40 GMT

వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణంరాజుపై పార్లమెంటు సభ్యుడు నందిగం సురేష్ మండిపడ్డారు. రఘురామ కృష‌్ణంరాజు కొన్ని పార్టీల చేతుల్లో పావుగా మారారన్నారు. ఆయనకు ధైర్యం ఉంటే ఏపీకి రావాలని నందిగం సురేష్ సవాల్ విసిరారు. రఘురామ కృష్ణంరాజుపై లోక్ సభ స్పీకర్ వెంటనే అనర్హత వేటు వేయాలని నందిగం సురేష్ డిమాండ్ చేశారు. తాము కూడా పార్టీ తరుపున చర్యలు తీసుకోవడం పై త్వరలో నిర్ణయం తీసుకుంటామని నందిగం సురేష్ చెప్పారు. ఆయన ఢిల్లీలో దాక్కుని జగన్ పై అవాకులు, చవాకులు పేలితే చూస్తూ ఊరుకోబోమని నందిగం సురేష్ హెచ్చరించారు.

Tags:    

Similar News