ఈఎస్ఐ స్కామ్ లో కీలక ఉద్యోగిని?

ఈఎస్ఐ స్కామ్ లో కీలక వ్యక్తిని ఏసీబీ అధికారులు అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది. గతంలో మంత్రి పితాని సత్యనారాయణ వద్ద పీఏగా పనిచేసిన మురళి అనే ఉద్యోగిని [more]

Update: 2020-07-10 08:28 GMT

ఈఎస్ఐ స్కామ్ లో కీలక వ్యక్తిని ఏసీబీ అధికారులు అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది. గతంలో మంత్రి పితాని సత్యనారాయణ వద్ద పీఏగా పనిచేసిన మురళి అనే ఉద్యోగిని ఏసీబీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం మురళి ఏపీ సెక్రటేరియట్ లో ని మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ విభాగంలో ఎస్.ఓ. గా పనిచేస్తున్నారు. పితాని సత్యనారాయణ మంత్రిగా ఉన్నప్పుడు కూడా అవకతవకలు జరిగాయని ఏసీబీ అధికారులు గుర్తించారు. ఏసీబీ సెంట్రల్ ఇన్విస్టిగేషన్ అధికారులు మురళిని ప్రస్తుతం విచారిస్తున్నారు. మరోవైపు పితాని సత్యనారాయణ కుమారుడు తనను ముందస్తు అరెస్ట్ చేయకుండా ఉత్తర్వులు ఇవ్వాలని కోర్టును ఆశ్రయించారు.

Tags:    

Similar News