చంద్రబాబుకు బీజేపీ ఎంపీ జీవీఎల్ సవాల్

తెలుగుదేశం పాలనలో కుల రాజకీయాలు, అవినీతి ఆరోపణలపై చర్చకు సిద్ధమా అని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహరావు సవాల్ విసిరారు. సోమవారం ఢిల్లీలో [more]

Update: 2019-02-25 07:01 GMT

తెలుగుదేశం పాలనలో కుల రాజకీయాలు, అవినీతి ఆరోపణలపై చర్చకు సిద్ధమా అని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహరావు సవాల్ విసిరారు. సోమవారం ఢిల్లీలో ఆయన మాట్లాడుతూ… తెలుగు రాష్ట్రాలు అవినీతిలో ముందున్నాయన్నారు. పోలవరం ప్రాజెక్టుకు కేంద్రం నిధులిస్తుంటే తానే నిర్మిస్తున్నానని చంద్రబాబు ప్రచారం చేసుకుంటున్నారని ఆరోపించారు. రాజధాని నిర్మాణానికి కేంద్రం నిధులిస్తుంటే తాత్కాలిక భవనాల పేరుతో వృధా చేస్తున్నారని, అమరావతిలో గ్రాఫిక్స్ మినహా ఏమీ లేదని పేర్కొన్నారు. సీబీఐ, ఈడీ, ఐటీలను తలుచుకొని చంద్రబాబు నాయుడు భయపడుతున్నారని అన్నారు.

Tags:    

Similar News