“మావో” పార్టీలో భారీ మార్పులు

మావోయిస్ట్ కేంద్ర కమిటీలో భారీగా మార్పులు చోటు చేసుకున్నాయి. మావోయిస్టు పార్టీని సంస్థాగతంగా మార్పులు చేశారు. మావోయిస్ట్ పార్టీ కేంద్రకమిటీ కార్యదర్శిగా నంబాల కేశవరావు అలియాస్ దేవరాజ్ [more]

Update: 2020-01-31 08:06 GMT

మావోయిస్ట్ కేంద్ర కమిటీలో భారీగా మార్పులు చోటు చేసుకున్నాయి. మావోయిస్టు పార్టీని సంస్థాగతంగా మార్పులు చేశారు. మావోయిస్ట్ పార్టీ కేంద్రకమిటీ కార్యదర్శిగా నంబాల కేశవరావు అలియాస్ దేవరాజ్ బాధ్యతలు చేపట్టి ఏడాది పూర్తి కావడంతో కేంద్ర కమిటీలో భారీ ప్రక్షాళన జరిగినట్లు తెలుస్తోంది. 21 మంది సభ్యులతో నూతన కేంద్రకమిటీ ఏర్పాటయింది. ఈ కమిటీలో తెలంగాణాకు చెందిన 10 మంది, ఆంధ్రప్రదేశ్ కు చెందిన ఇద్దరు, ఝార్ఖండ్ నుండి నలుగురు, మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్ నుండి ఇద్దరు, బీహార్ నుండి ఒకరికి అవకాశం ఇచ్చారు. ఆంద్రప్రదేశ్ నుండి కేంద్రకమిటీ కార్యదర్శిగా ఉన్న నంబాల కేశవరావు @ బస్వరాజ్ ఉన్నారు. అలాగే అక్కిరాజు హరగోపాల్ @ ఆర్ కే ఉన్నారు.

తెలంగాణ నుంచి…..

తెలంగాణా నుంచి 10మంది సభ్యులున్నారు. ముప్పాళ్ల లక్ష్మణరావు @ గణపతి, (కరీంనగర్), మాల్లోజుల వేణుగోపాల్ @ వివేక్, (కరీంనగర్), కటకం సుదర్శన్ @ ఆనంద్, (ఆదిలాబాద్), మల్లా రాజిరెడ్డి @ సంగ్రామ్, (కరీంనగర్), తిప్పిరి తిరుపతి@ దేవ్ జీ, (కరీంనగర్), కడారి సత్యనారాయణ @ కోసా, (కరీంనగర్), మోడెం బాలకృష్ణ @ మనోజ్( హైదరాబాద్), పుల్లూరి ప్రసాద రావు@ చంద్రన్న, (కరీంనగర్), గాజర్ల రవి @ గణేష్ (వరంగల్), పాక హనుమంతు@ ఉకే గణేష్, (నల్గొండ)లు కేంద్రకమిటీ లో ఉన్నారు.

Tags:    

Similar News