నేడు మోత్కుపల్లి ఒకరోజు దీక్ష

సీనియర్ నేత మోత్కుపల్లి నరసింహులు నేడు ఒకరోజు దీక్ష చేపట్టనున్నారు. దళితబంధు పథకానికి మద్దతుగా ఆయన ఈ దీక్ష చేపట్టారు. దళిత బంధు పథకంపై విపక్షాలు చేస్తున్నవన్నీ [more]

Update: 2021-08-29 04:32 GMT

సీనియర్ నేత మోత్కుపల్లి నరసింహులు నేడు ఒకరోజు దీక్ష చేపట్టనున్నారు. దళితబంధు పథకానికి మద్దతుగా ఆయన ఈ దీక్ష చేపట్టారు. దళిత బంధు పథకంపై విపక్షాలు చేస్తున్నవన్నీ తప్పుడు ఆరోపణలని మోత్కుపల్లి నరసింహులు అన్నారు. తెలంగాణ ప్రభుత్వం ప్రతి దళిత కుటుంబానికి పది లక్షల రూపాయలను ఇవ్వడం చరిత్రలో మరిచిపోలేనిదని మోత్కుపల్లి నరసింహులు అభిప్రాయపడ్డారు. కాసేపట్లో అంబేద్కర్ విగ్రహానికి నివాళుర్పించి మోత్కుపల్లి నరసింహులు దీక్షను ప్రారంభించనున్నారు.

Tags:    

Similar News