కేసీఆర్ మొనగాడు.. మోత్కుపల్లి మోత

దళిత బంధు పథకాన్ని అందరూ బలపర్చాలని సీనియర్ నేత మోత్కుపల్లి నరిసింహులు కోరారు. ఎవరూ అడ్డుపడవద్దని ఆయన అభ్యర్థించారు. కేసీఆర్ ను అందరూ బలపర్చాలని మోత్కుపల్లి నరిసింహులు [more]

Update: 2021-07-29 06:58 GMT

దళిత బంధు పథకాన్ని అందరూ బలపర్చాలని సీనియర్ నేత మోత్కుపల్లి నరిసింహులు కోరారు. ఎవరూ అడ్డుపడవద్దని ఆయన అభ్యర్థించారు. కేసీఆర్ ను అందరూ బలపర్చాలని మోత్కుపల్లి నరిసింహులు కోరారు. దళిత బంధు పథకం వల్ల పేదల జీవితాలతో వెలుగులు నిండుతాయని చెప్పారు. మిగిలిన పథకాలకు భిన్నంగా ఈ స్కీమ్ ఉందని మోత్కుపల్లి నరసింహులు అన్నారు. ఒక్కొక్క దళిత కుటుంబానికి పది లక్షలు ఇస్తామని చెప్పిన మొనగాడు కేసీఆర్ అని అన్నారు. ఈ స్కీమ్ అమలు చేస్తామని చెప్పే ధైర్యం ఏ రాజకీయ పార్టీకైనా ఉందా? అని మోత్కుపల్లి నరసింహులు ప్రశ్నించారు. కేసీఆర్ పై తనకు నమ్మకం ఉందన్నారు. దళిత బంధు పథకానికి వ్యతిరేకంగా మాట్లాడిన వారికి ప్రజలు బుద్ధి చెప్పాలని మోత్కుపల్లి నరసింహులు పిలుపునిచ్చారు.

Tags:    

Similar News