కేసీఆర్ బొమ్మ పెట్టుకుని ఈటల పూజించాలి

బీజేపీ నేత మోత్కుపల్లి నరసింహులు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈటల రాజేందర్ వ్యవహారం వ్యక్తిగత పంచాయతీ అని అన్నారు. ఈటల మంత్రిగా ఉండి తన కంపెనీల లబ్ది [more]

Update: 2021-05-07 01:37 GMT

బీజేపీ నేత మోత్కుపల్లి నరసింహులు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈటల రాజేందర్ వ్యవహారం వ్యక్తిగత పంచాయతీ అని అన్నారు. ఈటల మంత్రిగా ఉండి తన కంపెనీల లబ్ది కోసం ప్రయత్నించడం తప్పు కాదా? అని మోత్కుపల్లి నరసింహులు ప్రశ్నించారు. బీసీలకు అన్యాయం జరిగిందని ఈటల అనడం విడ్డూరంగా ఉందన్నారు. మంత్రి పదవిలో ఉండి తన కంపెనీల కోసం లాబీయింగ్ చేయడం తప్పు కాదా? అని ప్రశ్నించారు. ఈటలను మంత్రిని చేసినందుకు కేసీఆర్ ఫొటో పెట్టుకుని పూజించాలని మోత్కుపల్లి నరిసింహులు అభిప్రాయపడ్డారు. వ్యక్తిగత పంచాయతీని ప్రజలపై రుద్దడమేంటని మోత్కుపల్లి నరసింహులు నిలదీశారు

Tags:    

Similar News