Mothkupalli : మోత్కుపల్లి ఇప్పుడు ముద్దొస్తాడులే

సీనియర్ నేత మోత్కుపల్లి నరసింహులు నిన్న టీఆర్ఎస్ లో చేరారు. అయితే ఈరోజు ముఖ్యమంత్రి కేసీఆర్ తో కలసి మోత్కుపల్లి నరసింహులు యాదాద్రికి వచ్చారు. యాదాద్రి ఆలయ [more]

Update: 2021-10-19 07:52 GMT

సీనియర్ నేత మోత్కుపల్లి నరసింహులు నిన్న టీఆర్ఎస్ లో చేరారు. అయితే ఈరోజు ముఖ్యమంత్రి కేసీఆర్ తో కలసి మోత్కుపల్లి నరసింహులు యాదాద్రికి వచ్చారు. యాదాద్రి ఆలయ పనుల పరిశీలనలో కేసీఆర్ తో పాటు మోత్కుపల్లి నరసింహులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా యాదాద్రి నరసింహస్వామిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా వేదపండితులు ఆశీర్వచనాలు అందచేశారు. ఈ సందర్భంగా కేసీఆర్ పక్కన దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకిరణ్ రెడ్డి కూర్చోబోయారు. కానీ ఆయనను పక్కకు వెళ్లమని మోత్కుపల్లి నరసింహులను తన పక్కన కేసీఆర్ కూర్చోబెట్టుకోవడం చర్చనీయాంశమైంది.

Tags:    

Similar News