మోదుగుల థిక్కారం ఇదే మరి….!!

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబునాయుడి ఆదేశాలను ఎమ్మెల్యే మోదుగుల వేణుగోపాల్ రెడ్డి బేఖాతరు చేశారు. ఈరోజు కేంద్ర బడ్జెట్ సందర్భంగా ఏపీకి కేంద్రం చేసిన అన్యాయంపై [more]

Update: 2019-02-01 05:05 GMT

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబునాయుడి ఆదేశాలను ఎమ్మెల్యే మోదుగుల వేణుగోపాల్ రెడ్డి బేఖాతరు చేశారు. ఈరోజు కేంద్ర బడ్జెట్ సందర్భంగా ఏపీకి కేంద్రం చేసిన అన్యాయంపై నిరసన తెలియచేయాలని చంద్రబాబు నిర్ణయించారు. శుక్రవారం అసెంబ్లీ సమావేశాలకు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలందరూ నల్లచొక్కాలతో హాజరుకావాలని ఆదేశించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు సయితం నల్ల చొక్కా ధరించి వచ్చారు. కానీ గుంటూరు వెస్ట్ నియోజకవర్గ ఎమ్మెల్యే మోదుగుల వేణుగోపాల్ రెడ్డి మాత్రం సాధారణ చొక్కాతో అసెంబ్లీకి రావడం చర్చనీయాంశమైంది. నల్లచొక్కా ధరించినంత మాత్రాన నిరసన వ్యక్తం చేసినట్లు కాదని, అసెంబ్లీ ప్రత్యేక హోదాపై తీర్మానం చేసి వజ్రాయుధాన్ని కేంద్రానికి పంపామని మోదుగుల తెలిపారు. తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలంతా ఒకరూటు మోదుగులది ఒక రూటుగా నేటి అసెంబ్లీలో కన్పించింది.

Tags:    

Similar News