అడుగు పెట్టి చూడు సంగతి తేలుస్తాం.. మంత్రి అనిల్ కు వార్నింగ్

కర్నూలు జిల్లాలో అధికార పార్టీ వైసీపీ లో వర్గ విభేదాలు భగ్గుమంటున్నాయి. మంత్రి అనిల్ కుమార్ కు ఎమ్మెల్యే ఆర్థర్ వర్గీయులు హెచ్చరికలు జారీ చేశారు. నందికొట్కూరు [more]

Update: 2020-02-28 04:49 GMT

కర్నూలు జిల్లాలో అధికార పార్టీ వైసీపీ లో వర్గ విభేదాలు భగ్గుమంటున్నాయి. మంత్రి అనిల్ కుమార్ కు ఎమ్మెల్యే ఆర్థర్ వర్గీయులు హెచ్చరికలు జారీ చేశారు. నందికొట్కూరు నియోజకవర్గంలో మంత్రి అనిల్ కుమార్ యాదవ్ ఒక వర్గం కొమ్ముకాస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. సిద్ధార్థరెడ్డికి అనుకూలంగా అనిల్ కుమార్ యాదవ్ వ్యవహరిస్తున్నారంటూ వైసీపీ ఎమ్మెల్యే ఆర్థర్ వర్గీయులు మండి పడుతున్నారు. నందికొట్కూరు మార్కెట్ కమిటీ నియామకంలో ఈ వివాదంచోటు చేసుకుంది. మార్కెట్ కమిటీ ప్రమాణ స్వీకారాన్ని యధాతధంగా చేయించకపోతే కర్నూలు జిల్లాలో అడుగు పెట్టనివ్వమని మంత్రి అనిల్ కుమార్ ను ఆర్థర్ వర్గీయులు హెచ్చరించారు. దళిత ఎమ్మెల్యే అంటే అనిల్ కు అంత చులకనా? అని ప్రశ్నిస్తున్నారు. కర్నూలు ఇన్ ఛార్జిగా మంత్రి అనిల్ కుమార్ యాదవ్ వ్యవహరిస్తున్నారు.

Tags:    

Similar News