రాళ్లదాడి అనేదే అవాస్తవం

తిరుపతిలో చంద్రబాబు పై రాళ్లదాడి జరిగిందన్నది నిజం కాదని ఏపీ హోంమంత్రి మేకతోటి సుచరిత తెలిపారు. కేవలం సానుభూతి కోసమే రాళ్ల దాడి జరిగినట్లు చిత్రీకరించారని సుచరిత [more]

Update: 2021-04-14 01:19 GMT

తిరుపతిలో చంద్రబాబు పై రాళ్లదాడి జరిగిందన్నది నిజం కాదని ఏపీ హోంమంత్రి మేకతోటి సుచరిత తెలిపారు. కేవలం సానుభూతి కోసమే రాళ్ల దాడి జరిగినట్లు చిత్రీకరించారని సుచరిత తెలిపారు. చంద్రబాబు పై రాళ్ల దాడి చేయాల్సిన అవసరం ఎవరికి ఉందని సుచరిత ప్రశ్నించారు. ఓటమి భయంతోనే చంద్రబాబు ఇలాంటి డ్రామాలకు తెరలేపుతున్నారని సుచరిత అన్నారు. వివేకానందరెడ్డి హత్య కేసులో త్వరలో అసలు నిజాలు తెలుస్తాయని సుచరిత తెలిపారు.

Tags:    

Similar News