పార్టీ మార్పు వార్తలపై మేకపాటి స్పందన

తాను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు వచ్చిన వార్తలపై మాజీ ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డి స్పందించారు. గురువారం ఆయన ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ… తనపై [more]

Update: 2019-01-31 08:04 GMT

తాను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు వచ్చిన వార్తలపై మాజీ ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డి స్పందించారు. గురువారం ఆయన ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ… తనపై కొన్ని మీడియా సంస్థలు పని గట్టుకొని దుష్ప్రచారం చేస్తున్నాయని, నైతిక విలువలతో వార్తలు రాయాలని పేర్కొన్నారు. వైసీపీ స్థాపించిన నాటి నుంచి తాను జగన్ వెంటే ఉన్నానని… ఇక ముందు కూడా జగన్ తోనే ఉంటానని స్పష్టం చేశారు. ప్రత్యేక హోదా కోసం తాము ముందునుంచీ పోరాడుతున్నామని, ధర్నాలు, దీక్షలు చేశామన్నారు. చివరకు హోదా కోసం పదవులకు సైతం రాజీనామా చేశామని గుర్తు చేశారు. చంద్రబాబు వల్లే ఆంధ్రప్రదేశ్ కు అన్యాయం జరిగిందని, ఇప్పుడు ఎన్నికల వేళ కొత్త హామీలు ఇస్తున్నారని అన్నారు. ఆయన పాలనతో ఏపీ ప్రజలు విసుగెత్తిపోయారన్నారు.

Tags:    

Similar News