భాష విధ్వంసానికి కుట్ర జరుగుతోంది

తెలుగు భాషకు వైసీపీ ప్రభుత్వం అన్యాయం చేస్తుందని మాజీ మంత్రి మండలి బుద్ధ ప్రసాద్ అభిప్రాయపడ్డారు. తెలుగు భాష ప్రాశస్త్యంపై ముఖ్యమంత్రికి అవగాహన లేదన్నారు. ఇటీవల తెలుగు [more]

Update: 2021-07-19 07:31 GMT

తెలుగు భాషకు వైసీపీ ప్రభుత్వం అన్యాయం చేస్తుందని మాజీ మంత్రి మండలి బుద్ధ ప్రసాద్ అభిప్రాయపడ్డారు. తెలుగు భాష ప్రాశస్త్యంపై ముఖ్యమంత్రికి అవగాహన లేదన్నారు. ఇటీవల తెలుగు అకాడమీ పేరును మార్చిన ప్రభుత్వం తాజాగా సాహిత్య, కళలు, చరిత్ర అకాడమీని ఏర్పాటు చేయడం విచారకరమని మండలి బుద్ద ప్రసాద్ అన్నారు. సంబంధం లేని వారిని అధ్యక్షులుగా ప్రకటించారని మండలి బుద్ధ ప్రసాద్ ఫైర్ అయ్యారు. పొరుగు రాష్ట్రాల అకాడమీలకు విశిష్ట వ్యక్తులు అధ్యక్షులుగా ఉన్న విషయాన్ని మండలి బుద్ధ ప్రసాద్ గుర్తు చేశారు. ఇది తెలుగు భాషా విధ్వంసానికి జరుగుతున్న కుట్ర అని ఆయన అన్నారు.

Tags:    

Similar News