హింసను ప్రోత్సహిస్తుంది వాళ్లే

పశ్చిమ బెంగాల్ లో హింసను ప్రోత్సహిస్తుంది బీజేపీయేనని ముఖ్యమంత్రి మమత బెనర్జీ అన్నారు. ఎన్నికల సమయంలోనూ బీజేపీ అనేక కుట్రలు పన్నిందన్నారు. కేంద్ర మంత్రులంతా రాష్ట్రానికి వచ్చి [more]

Update: 2021-05-09 01:29 GMT

పశ్చిమ బెంగాల్ లో హింసను ప్రోత్సహిస్తుంది బీజేపీయేనని ముఖ్యమంత్రి మమత బెనర్జీ అన్నారు. ఎన్నికల సమయంలోనూ బీజేపీ అనేక కుట్రలు పన్నిందన్నారు. కేంద్ర మంత్రులంతా రాష్ట్రానికి వచ్చి కుట్రలు చేశారన్నారు. ఎన్ని కోట్లు ఖర్చు చేసినా బెంగాల్ ప్రజలు తమ వైపే నిలబడ్డారని మమత బెనర్జీ అన్నారు. తాము ఎప్పుడూ హింసను ప్రోత్సహించలేదని చెప్పారు. ఎన్నికల్లో ఓటమిని జీర్ణించుకోలేక హింసకు దిగుతుందని మమత బెనర్జీ రివర్స్ అటాక్ చేశారు. ఎన్నికల కమిషన్ లోనూ తక్షణం సంస్కరణలు జరగాలని మమత బెనర్జీ అభిప్రాయపడ్డారు.

Tags:    

Similar News