ముదురుతున్న మైల‌వ‌రం వివాదం

మైల‌వ‌రం వివాదం మ‌రింత ముదురుతోంది. త‌న‌ను ప్ర‌లోభ‌పెట్టుందుకు ప్ర‌య‌త్నించారంటూ నిన్న ఎస్సై ఫిర్యాదుతో వైసీపీ నియోజ‌క‌వ‌ర్గ ఇంఛార్జి వ‌సంత కృష్ణ‌ప్ర‌సాద్‌, మ‌రో నేత రామారావుపై కేసు న‌మోదైంది. [more]

Update: 2019-02-07 06:45 GMT

మైల‌వ‌రం వివాదం మ‌రింత ముదురుతోంది. త‌న‌ను ప్ర‌లోభ‌పెట్టుందుకు ప్ర‌య‌త్నించారంటూ నిన్న ఎస్సై ఫిర్యాదుతో వైసీపీ నియోజ‌క‌వ‌ర్గ ఇంఛార్జి వ‌సంత కృష్ణ‌ప్ర‌సాద్‌, మ‌రో నేత రామారావుపై కేసు న‌మోదైంది. అయితే, మంత్రి దేవినేని ఉమ ప్రోత్భ‌లంతోనే రాజ‌కీయంగా ఎదుర్కోలేక ఇలా త‌ప్పుడు కేసులు పెట్టిస్తున్నార‌ని వైసీపీ నేత‌లు ఆరోపిస్తున్నారు. ఈ మేర‌కు ఇవాళ అక్ర‌మ కేసుల‌కు నిర‌స‌న‌గా కృష్ణ‌ప్రసాద్ ఆధ్వ‌ర్యంలో వైసీపీ నేత‌లు మైల‌వ‌రం పోలీస్ స్టేష‌న్ ముందు ధ‌ర్నాకు దిగారు. అయితే, వైసీపీ ధ‌ర్నాకు పోటీగా దేవినేని ఉమ వ‌ర్గీయులు, టీడీపీ నేత‌లు సైతం ఆందోళ‌న‌కు దిగారు. దీంతో ఉద్రిక్త ప‌రిస్థితులు నెల‌కొన్నాయి.

 

Tags:    

Similar News