బ్రేకింగ్ : నల్గొండ జిల్లాలో నడిరోడ్డుపై దారుణం..!

Update: 2018-09-14 10:46 GMT

నల్గొండ జిల్లా మిర్యాలగూడలో ఓ యువకుడు దారుణ హత్య కు గురయ్యాడు. కడుపుతో ఉన్నా తన భార్యను హాస్పటల్ లో చూపించి తిరిగి వెళుతున్న సమయంలో గుర్తు తెలియని వ్యక్తి వెనుక నుండి తల్వార్ తో దాడి చేసి హతమార్చాడు. మృతిచెందిన యువకుడు పట్టణంలోని వినోభానగర్ కు చెందిన పెరుమళ్ల ప్రణయ్ కుమార్ గా గుర్తించారు. మృతుడు ప్రణయ్ గత ఆరునెలల క్రితం పట్టణంలోని ప్రముఖ రియల్ఎస్టేట్ వ్యాపారి ఏకైక కుమార్తె అమృతను ప్రేమ వివాహం చేసుకొని ఇటీవలే రిసెప్షన్ కూడా గ్రాండ్ గా చేసుకున్నారు. పెండ్లి సమయంలోనే ఇరువర్గాల మధ్య తీవ్రస్థాయిలో ఘర్షణ నెలకొనగా పొలీసు ఉన్నతాధికారుల జోక్యంతో అ సమస్య సద్దుమణిగింది. ఈ క్రమంలోనే భార్య అమృతను స్థానిక జ్యోతి హాస్పిటల్ లో చూపించి తిరిగి ఇంటికి వెళ్తుండగా గుర్తుతెలియని వ్యక్తి తల్వార్ తో దాడిచెయ్యడంతో ప్రణయ్ అక్కడిక్కడే మృతి చెందాడు. ప్రేమ వివాహమే యువకుడి హత్యకు కారణమని భావించిన మృతుడి కుటుంబికులు ఆందోళనకు దిగడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. జిల్లా ఎస్పీ రంగనాథ్ సంఘటన స్థలానికి చేరుకొని పరిస్థితి సమీక్షిస్తున్నారు.

Similar News