నరేంద్ర మోదీ పాపులారిటీపై ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేష్ తనదైన శైలిలో విమర్శలు గుప్పించారు. మోదీ పాపులారిటీ చేసి కొన్ని పార్టీలు ముందస్తు ఎన్నికలకు భయపడుతున్నాయని బీజేపీ ప్రధాన కార్యదర్శి రాంమాధవ్ ట్వీట్ చేశారు. ఈ ట్వీట్కి స్పందించిన నారా లోకేష్ కౌంటర్ వేశారు. కర్ణాటక ఎన్నికల్లో బీజేపీ ఓడిపోయిందని, దేశవ్యాప్తంగా వరుసగా ఎదురుదెబ్బలు తింటోందని గుర్తుచేశారు. అందుకే బీజేపీ ముందస్తు ఎన్నికలు అంటోందని, ఇదేనా మోదీ పాపులారిటీ అంటూ ట్విట్టర్ వేదికగా రాంమాధవ్ను ప్రశ్నించారు.