Ycp : నేడు వైసీపీ ఎమ్మెల్సీ అభ్యర్థుల జాబితా విడుదల

ఎమ్మెల్సీ అభ్యర్థుల జాబితాను నేడు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ విడుదల చేసే అవకాశముంది. స్థానిక సంస్థల కోటాలో 11 మంది ఎమ్మెల్సీ అభ్యర్థులను నేడు జగన్ ఖరారు [more]

Update: 2021-11-12 02:35 GMT

ఎమ్మెల్సీ అభ్యర్థుల జాబితాను నేడు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ విడుదల చేసే అవకాశముంది. స్థానిక సంస్థల కోటాలో 11 మంది ఎమ్మెల్సీ అభ్యర్థులను నేడు జగన్ ఖరారు చేయనున్నట్లు సమాచారం. మొత్తం 11 మందిలో యాభై శాతం మందికి ఎస్సీ, ఎస్టీ, బీసీ, ,మైనారిటీలకు ఇచ్చే అవకాశాలున్నాయి.

వీరి పేర్లు ఖరారయినట్లు….

అయితే పలువురి పేర్లను పరిశీలించిన జగన్ తుది జాబితాకు ఓకే చెప్పినట్లు తెలిసింది. విజయనగరం జిల్లా నుంచి ఇందుకూరు రఘురాజు, విశాఖపట్నం నుంచి వంశీకృష్ణ శ్రీనివాస్, తూర్పుగోదావరి జిల్లా నుంచి అనంతబాబు, గుంటూరు జిల్లా నుంచి మర్రి రాజశేఖర్ , ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, చిత్తూరు నుంచి భరత్, ప్రకాశం జిల్లా నుంచి రావి రామనాధం బాబు, కృష్ణా జిల్లా నుంచి తలశిల రఘురాం, అనంతపురం నుంచి విశ్వేశ్వర్ రెడ్డి పేర్లు ఖరారాయ్యాయని తెలిసింది. ఈరోజు జాబితాను వైసీపీ ప్రకటించే అవకాశముంది.

Tags:    

Similar News