Ktr : కంటోన్మెంట్ పై కేటీఆర్ కీలక వ్యాఖ్యలు

కంటోన్మెంట్ ప్రాంతంపై రాష్ట్ర ప్రభుత్వ అజమాయిషీ లేకపోవడంతో సామాన్య ప్రజలు ఇబ్బంది పడుతున్నారని మంత్రి కేటీఆర్ అన్నారు. అక్కడ రోడ్లు, స్కే వేలే వేసేందుకు వాళ్లు అంగీకరించడం [more]

Update: 2021-09-23 12:48 GMT

కంటోన్మెంట్ ప్రాంతంపై రాష్ట్ర ప్రభుత్వ అజమాయిషీ లేకపోవడంతో సామాన్య ప్రజలు ఇబ్బంది పడుతున్నారని మంత్రి కేటీఆర్ అన్నారు. అక్కడ రోడ్లు, స్కే వేలే వేసేందుకు వాళ్లు అంగీకరించడం లేదన్నారు. వారి పద్ధతి ఎంత మాత్రం బాగా లేదని కేటీఆర్ అన్నారు. కంటోన్మెంట్ ను జీహెచ్ఎంసీ లో విలీనం చేయాలని మెజారిటీ ప్రజలు కోరుతున్నారని కేటీఆర్ అన్నారు. రోడ్లు కూడా వేయలేకపోతుండటంతో సామాన్య ప్రజలు కూడా ఇబ్బంది పడుతున్నారన్నారు. ఇప్పటికే అక్కడ నలభై రోడ్లు మూసివేయడంతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారన్నారు. దీనిపై ముఖ్యమంత్రితో చర్చించి త్వరలో ఒక నిర్ణయం తీసుకుంటామని కేటీఆర్ తెలిపారు.

Tags:    

Similar News