రైతుల కోసమే టీడీపీలో చేరాం: కోట్ల

మాజీ కేంద్రమంత్రి, కాంగ్రెస్ కు రాజీనామా చేసిన కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి తెలుగుదేశం పార్టీలో చేరారు. కర్నూలు జిల్లా కోడుమూరులో జరిగిన సభలో ఆయనతో పాటు ఆయన [more]

Update: 2019-03-02 11:15 GMT

మాజీ కేంద్రమంత్రి, కాంగ్రెస్ కు రాజీనామా చేసిన కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి తెలుగుదేశం పార్టీలో చేరారు. కర్నూలు జిల్లా కోడుమూరులో జరిగిన సభలో ఆయనతో పాటు ఆయన సతీమణి కోట్ల సుజాతమ్మ, కుమారుడు రాఘవేందర్ రెడ్డి, అనుచరులు కూడా తెలుగుదేశం పార్టీలో చేరారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వారికి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. కొత్తగా పార్టీలో చేరిన వారిని సంతోషంగా ఆహ్వానిస్తున్నట్లు ఉపముఖ్యమంత్ర కేఈ కృష్ణమూర్తి పేర్కొన్నారు. పెండింగ్ లో ఉన్న ప్రాజెక్టులు పూర్తి చేసి రైతులకు మేలు చేయాలని తాను చేసిన డిమాండ్ కు స్పందించి నెరవేరుస్తున్నందునే తాను టీడీపీలో చేరుతున్నానని కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి స్పష్టం చేశారు. ఈసారి కర్నూలు జిల్లాలోని మొత్తం 14 అసెంబ్లీ, 2 పార్లమెంటు స్థానాల్లో టీడీపీనే గెలవబోతుందన్నారు. గతంలో తాను కాంగ్రెస్ లో ఉనప్పుడు చంద్రబాబు రైతు వ్యతిరేకి అని ఆరోపించానని, కానీ ఆయన రైతుల కోసం ఎంతో చేస్తున్నారన్నారు.

Tags:    

Similar News