కోమటిరెడ్డి నో రెస్పాన్స్

Update: 2018-09-25 13:13 GMT

కాంగ్రెస్ ఎమ్మెల్సీ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి 24 గంటల షోకాజ్ నోటీసుకు స్పందించలేదు. ఆయనకు 24 గంటల షోకాజ్ నోటీసును నిన్న కాంగ్రెస్ క్రమశిక్షణ సంఘం ఇచ్చిన సంగతి తెలిసిందే. ఇటీవల కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ ఛార్జి కుంతియాపైన, కాంగ్రెస్ నేతలపైన విమర్శలు చేసిన సంగతి తెలిసిందే. దీనిపై తొలి షోకాజ్ నోటీసుకు మీడియా సమావేశం పెట్టిన కోమటిరెడ్డి మరోసారి తన వ్యాఖ్యలను సమర్థించుకున్నారు. దీంతో రెండో విడత షోకాజ్ నోటీసు జారీ చేసింది. దీనికి కోమటిరెడ్డి నుంచి సమాధానం రాలేదు. దీంతో రేపు మరోసారి కాంగ్రెస్ క్రమశిక్షణ సంఘం భేటీకానుంది. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిపై చర్యలకు దిగుతుందా? అంత సాహసం చేస్తుందా? అన్నది పార్టీలో చర్చనీయాంశంగా మారింది. నల్లొండ జిల్లాలో పట్టున్నకోమటిరెడ్డి సోదరులపై ఎన్నికలకు ముందు చర్యలు తీసుకోవడం జరగదన్నది గాంధీభవన్ వర్గాల సమాచారం.

Similar News