సొల్లు చెప్పేది బాబు.. సోడాలమ్ముకునే ఉమ

చంద్రబాబు రైతులకు బకాయి పెట్టిన విద్యుత్తు బిల్లులను తమ ప్రభుత్వం వచ్చిన తర్వాత చెల్లించామని మంత్రి కొడాలి నాని అన్నారు. వైఎస్ బొమ్మ పార్టీ జెండాలో పెట్టుకున్న [more]

Update: 2020-09-04 06:51 GMT

చంద్రబాబు రైతులకు బకాయి పెట్టిన విద్యుత్తు బిల్లులను తమ ప్రభుత్వం వచ్చిన తర్వాత చెల్లించామని మంత్రి కొడాలి నాని అన్నారు. వైఎస్ బొమ్మ పార్టీ జెండాలో పెట్టుకున్న తాము రైతులకు ఎలా అన్యాయం చేస్తామని నాని ప్రశ్నించారు. చంద్రబాబు లాంటి దళారి మాటలను రైతులు ఎవరూ నమ్మవద్దన్నారు. మీటర్లు బిగిస్తే రైతులకు అన్యాయం జరగుతుందని చంద్రబాబు పదే పదే ప్రచారం చేయడాన్ని నాని ఖండించారు. చంద్రబాబు, ఆయన ఎల్లో మీడియా అదే పనిగా దుష్ప్రచారం చేస్తుందన్నారు. రైతులు ఎంత విద్యుత్ ను వినియోగించుకున్నా ప్రభుత్వమే బిల్లులు చెల్లిస్తుందన్నారు కొడాలి నాని. రైతులు జగన్ ను అర్థం చేసుకున్నారన్నారు. 73 రోజులు ఆసుపత్రిలో రిమాండ్ లో ఉన్న ఖైదీ ఈ భూ ప్రపంచంలో అచ్చెన్నాయుడు తప్ప ఎవరైనా ఉన్నారా? అని కొడాలి నాని ప్రశ్నించారు. చంద్రబాబు మాత్రం అచ్చెన్నాయుడును హింసించారంటున్నారు. 2024కు చంద్రబాబు అన్నీ ఫ్రీ అంటారని, అప్పటికి చంద్రబాబు వయసు అయిపోతుందన్నారు. మైండ్ కూడా పోతుందన్నారు. ఇక చంద్రబాబు అధికారంలోకి వచ్చేది లేదు చచ్చేది లేదని కొడాలి నాని అన్నారు. దేవినేని ఉమ తనను లారీ డ్రైవర్ అంటున్నారని, దేవినేని ఉమ తండ్రి సోడాలు విక్రయించేవాడన్నారు. దేవినేని ఉమ సోడాలు కడుక్కునే వారన్నారు. వదినను చంపి రాజకీయాల్లోకి వచ్చిన వాడు దేవినేని ఉమ అని కొడాలి నాని ఫైర్ అయ్యారు.

Tags:    

Similar News