ఎన్నికలకు, సెకండ్ వేవ్ కు సంబంధం ఏంటి?

ఐదు రాష్ట్రాల ఎన్నికలకు, కరోనా సెకండ్ వేవ్ కు సంబంధం లేదని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. దానిని తప్పుడు ప్రచారంగా కొట్టిపారేశారు. ఎన్నికలు ఎప్పుడు [more]

Update: 2021-05-12 00:41 GMT

ఐదు రాష్ట్రాల ఎన్నికలకు, కరోనా సెకండ్ వేవ్ కు సంబంధం లేదని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. దానిని తప్పుడు ప్రచారంగా కొట్టిపారేశారు. ఎన్నికలు ఎప్పుడు నిర్వహించాలన్నది ఎన్నికల కమిషన్ నిర్ణయిస్తుందని కిషన్ రెడ్డి చెప్పారు. ఇక లాక్ డౌన్ నిర్ణయాన్ని కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకే వదిలేసిందన్నారు. ఆ యా రాష్ట్రాల్లో పరిస్థితులను బట్టి లాక్ డౌన్ పెట్టాలా? లేదా? అన్నది రాష్ట్ర ప్రభుత్వాలే నిర్ణయించుకోవాలని కిషన్ రెడ్డి అభిప్రాయపడ్డారు. కోరోనాను కట్టడి చేయడంలో ప్రభుత్వానికి ప్రజలు సహకరించాలని కిషన్ రెడ్డి కోరారు.

Tags:    

Similar News