బ్రేకింగ్ : స్వల్ప తేడాతో కిషన్ రెడ్డి ఓటమి

Update: 2018-12-11 09:55 GMT

తెలంగాణ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీకి ఘోర పరాభవం ఎదురైంది. ఆ పార్టీ శాసనసభా పక్ష నేతగా కొనసాగిన జి.కిషన్ రెడ్డి ఎవరూ ఊహించని విధంగా ఓటమిపాలయ్యారు. అంబర్ పేట నియోజకవర్గంలో ఆయనపై టీఆర్ఎస్ అభ్యర్థి కాలేరు వెంకటేష్ వెయ్యి ఓట్ల స్వల్ప మెజారిటీతో విజయం సాధించారు. ఇక ముషిరాబాద్ లో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు డా.లక్ష్మణ్ కూడా ఓటమి అంచున ఉన్నారు. ఆయనపై టీఆర్ఎస్ అభ్యర్థి ముఠా గోపాల్ భారీ ఆధిక్యంలో ఉన్నారు.

Similar News