కోట్ల చేరికపై నా అభిప్రాయం అడగలేదు

ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి ఇవాళ అమరావతిలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో భేటీ అయ్యారు. అయితే, కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి టీడీపీలో చేరిక అంశంపై వీరి మధ్య [more]

Update: 2019-01-30 08:27 GMT

ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి ఇవాళ అమరావతిలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో భేటీ అయ్యారు. అయితే, కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి టీడీపీలో చేరిక అంశంపై వీరి మధ్య చర్చ రాలేదని కేఈ కృష్ణమూర్తి తెలిపారు. చంద్రబాబుతో భేటీ తర్వాత ఆయన మాట్లాడుతూ… కోట్ల చేరిక అంశాన్ని చంద్రబాబు ప్రస్తావనకు తేలేదని, తన అభిప్రాయం అడగలేదన్నారు. తాను ఈ అంశంపై మాట్లాడలేదని పేర్కొన్నారు. అయితే, తన అభిప్రాయం అడిగినప్పుడు మాత్రమే చెబుతానన్నారు. కోట్ల కుటుంబం ఏయే స్థానాలు అడుగుతుందో తనకు తెలియదన్నారు. అయితే, కోట్ల చేరికపై చంద్రబాబు కర్నూలు జిల్లాలో కీలక నేతగా ఉన్న, అందునా కోట్లతో రాజకీయ విభేదాలు ఉన్న కేఈ కృష్ణమూర్తికి అభిప్రాయం తీసుకోకపోవడం ఆశ్చర్యకరమే.

Tags:    

Similar News