కేసీఆర్ మరో యాగం..! ఈసారి ఎందుకు..?

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మరో యాగం నిర్వహించనున్నారు. ఎర్రవెల్లిలోని ఆయన ఫామ్ హౌజ్ లో మహారుద్ర సహిత సహస్ర చండీ యాగం నిర్వహించాలని కేసీఆర్ నిర్ణయించారు. జనవరి [more]

Update: 2019-01-10 13:00 GMT

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మరో యాగం నిర్వహించనున్నారు. ఎర్రవెల్లిలోని ఆయన ఫామ్ హౌజ్ లో మహారుద్ర సహిత సహస్ర చండీ యాగం నిర్వహించాలని కేసీఆర్ నిర్ణయించారు. జనవరి 21 నుంచి 25వ తేదీ వరకు ఐదు రోజుల పాటు సుమారు 200 మంది వేద పండితులతో ఈ యాగం అత్యంత వైభవంగా నిర్వహించాలని భావిస్తున్నారు. ఆయన ఇంతకుముందు కూడా ఫామ్ హౌజ్ లో భారీ ఎత్తున యాగం నిర్వహించారు. ఈ యాగానికి భక్తులను అనుమతించడం లక్షల సంఖ్యలో భక్తులు యాగంలో పాల్గొన్నారు. ఎన్నికలకు ముందు కూడా ఆయన విశాఖ స్వరూపానందేంద్ర స్వామి సూచనల మేరకు రాజశ్యామల యాగం చేశారు. తర్వాత జరిగిన ఎన్నికల్లో తిరుగులేని విజయం సాధించారు. మరి, ఇప్పుడు నిర్వహించే యాగం ఉద్దేశ్యం ఎంటో తెలియదు.

Tags:    

Similar News