ఇక హైదరాబాద్ పై కేసీఆర్ దృష్టి..!

Update: 2018-12-01 13:48 GMT

గ్రేటర్ హైదరాబాద్ ను ప్రజాకూటమి, బీజేపీ టార్గెట్ చేయడంతో టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ వారి కంటే ముందే అలెర్ట్ అయ్యారు. హైదరాబాద్ లో ఎక్కువ స్థానాలు గెలుచుకోవాలనే టార్గెట్ పెట్టుకున్న కేసీఆర్ ఇక్కడ ప్రచారపర్వంలో దిగారు. ఇప్పటివరకు గ్రేటర్ లో ప్రచార బాధ్యతలను పూర్తిగా కేటీఆర్ చూసుకున్నారు. కేసీఆర్ జిల్లాల్లో సభలు నిర్వహిచారు. అయితే, హైదరాబాద్ లో చంద్రబాబు సుమారు వారం రోజుల పాటు ప్రచారం నిర్వహించడం, బీజేపీ కూడా మోదీ సహా స్టార్ క్యాంపెయినర్లతో హైదరాబాద్ లో ప్రచారం చేయిస్తుండటంతో కేసీఆర్ ఆదివారం హైదరాబాద్ లో బలప్రదర్శన చేయనున్నారు. పెరేడ్ గ్రౌండ్ లో సుమారు 4 లక్షల మందితో భారీ బహిరంగ సభ నిర్వహించనున్నారు. ఈ సభతో ప్రత్యర్థులకు కౌంటర్ ఇవ్వడంతో పాటు హైదరాబాద్ ప్రజలకు ఆయన స్పష్టమైన సందేశం ఇవ్వనున్నారు. ఈ సభ ద్వారా హైదరాబాద్ లో టీఆర్ఎస్ కు మరింత బలం పెరుగుతుందని ఆ పార్టీ నేతలు భావిస్తున్నారు.

Similar News