పక్కా సమాచారం ఉంది.. అప్రమత్తంగా ఉండండి

జీహెచ్ఎంసీ ఎన్నికల సందర్భంగా కొందరు అల్లర్లు సృష్టించేందుకు ప్రయత్నిస్తున్నారని ముఖ్యమంత్రి కేసీఆర్ అభిప్రాయపడ్డారు. తమ వద్ద పక్కా సమాచారం ఉందన్నారు. అల్లర్లు సృష్టించే వారిపై కఠినంగా వ్యవహరించాలని [more]

Update: 2020-11-26 02:13 GMT

జీహెచ్ఎంసీ ఎన్నికల సందర్భంగా కొందరు అల్లర్లు సృష్టించేందుకు ప్రయత్నిస్తున్నారని ముఖ్యమంత్రి కేసీఆర్ అభిప్రాయపడ్డారు. తమ వద్ద పక్కా సమాచారం ఉందన్నారు. అల్లర్లు సృష్టించే వారిపై కఠినంగా వ్యవహరించాలని కేసీఆర్ పోలీసు ఉన్నతాధికారులను ఆదేశించారు. మత విద్వేషాలను రెచ్చగొట్టి గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలను వాయిదా వేయించాలని చూస్తున్నారని కేసీఆర్ ఈ సమావేశంలో ఉన్నారు. మత విధ్వేషాలను రెచ్చగొట్టి రాజకీయ ప్రయోజనాలు పొందాలనుకునేవారి పట్ల అప్రమత్తంగా ఉండాలని కేసీఆర్ పోలీసు అధికారులను ఆదేశించారు.

Tags:    

Similar News