టీఆర్ఎస్ ను చీల్చిందెవరు?

కాంగ్రెస్ శాసనసభ్యులను తాము పార్టీలో చేర్చుకోలేదని, వారే విలీనమయ్యారని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. తాము రాజ్యాంగ బద్ధంగానే కాంగ్రెస్ పార్టీని తమ పార్టీలో విలీనం చేసుకున్నామని చెప్పారు. [more]

Update: 2019-09-22 06:51 GMT

కాంగ్రెస్ శాసనసభ్యులను తాము పార్టీలో చేర్చుకోలేదని, వారే విలీనమయ్యారని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. తాము రాజ్యాంగ బద్ధంగానే కాంగ్రెస్ పార్టీని తమ పార్టీలో విలీనం చేసుకున్నామని చెప్పారు. శాసనసభలో కేసీఆర్ మాట్లాడుతూ కాంగ్రెస్ విలీనాన్ని తప్పుపడుతున్న కాంగ్రెస్ నేతలకు రాజస్థాన్ గురించి తెలియదా? అని ప్రశ్నించారు. అక్కడ మిత్రపక్షంగా ఉన్న బీఎస్పీ ఆరుగురు ఎమ్మెల్యేలను విలీనం చేసుకుందెవరు అని నిలదీశారు. రాష్ట్రానికో రాజ్యాంగం ఉంటుందా? అని అన్నారు. తాము కాంగ్రెస్ సభ్యులను చేర్చుకోవడంలో రాజ్యాంగ బద్ధంగానే వ్యవహరించామన్నారు. ఉద్యమసమయంలోనే కాంగ్రెస్ టీఆర్ఎస్ సభ్యులను చీల్చిన విషయాన్ని ఈ సందర్భంగా కేసీఆర్ గుర్తు చేశారు.

Tags:    

Similar News