తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి ఎం.కరుణానిధి అంతిమయాత్ర ప్రారంభమైంది. మెరినా బీచ్ లో అన్నాదురై సమాధి పక్కనే కరుణ అంత్యక్రియలు జరుగనున్నాయి. కరుణానిధి పార్థివదేహాన్ని ఖననం చేయనున్నారు. అయితే, కరుణ శవపేటికపై రాసిన మాటలు... ఆయన జీవితాన్ని ప్రతిబింబిస్తున్నాయి. ‘‘విరామం అనేదే తిలియక, నిరంతరం కష్టపడ్డ వ్యక్తి ఇక్కడ విశ్రాంతి తీసుకుంటున్నారు’’ అని శవపేటికపై రాయించారు.