కన్నాకు అనూహ్యమైన షాక్… అందుకేనా?

బీజేపీ కేంద్ర నాయకత్వం కన్నా లక్ష్మీనారాయణకు అనూహ్యమైన షాక్ ఇచ్చింది. రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడిగా సోము వీర్రాజును నియమిస్తూ ఆదేశాలు జారీ చేసింది. కన్నా లక్ష్మీనారాయణను తప్పిస్తారని [more]

Update: 2020-07-28 02:10 GMT

బీజేపీ కేంద్ర నాయకత్వం కన్నా లక్ష్మీనారాయణకు అనూహ్యమైన షాక్ ఇచ్చింది. రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడిగా సోము వీర్రాజును నియమిస్తూ ఆదేశాలు జారీ చేసింది. కన్నా లక్ష్మీనారాయణను తప్పిస్తారని చాలా రోజుల నుంచి ప్రచారం జరుగుతోంది. ఆయన అధికార పార్టీపై విమర్శలు ఎక్కువ చేస్తుండటం, టీడీపీకి అనుకూలురన్న ప్రచారంతో ఆయనను తప్పించినట్లు తెలుస్తోంది. మూడు రాజధానుల బిల్లులపై గవర్నర్ కు లేఖ రాయడం కూడా వివాదాస్పదంగా మారింది. మరో విడత కన్నా లక్ష్మీనారాయణకు ఛాన్స్ ఇస్తారనుకున్నా ఆయనను తప్పించడం వెనక వ్యవహార శైలి కారణమంటున్నారు.

Tags:    

Similar News