ఆలయాల జోలికి వస్తే ఖబడ్దార్

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ దేవాలయ భూముల అమ్మకానికి వ్యతిరేకంగా దీక్ష చేపట్టారు. ఆయన తన ఇంట్లోనే ఒకరోజు దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా కన్నా [more]

Update: 2020-05-26 07:10 GMT

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ దేవాలయ భూముల అమ్మకానికి వ్యతిరేకంగా దీక్ష చేపట్టారు. ఆయన తన ఇంట్లోనే ఒకరోజు దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా కన్నా లక్ష్మీనారాయణ మీడియాతో మాట్లాడారు. హిందువుల ఆలయాల జోలికి రావద్దని గతంలో అనేక సార్లు చెప్పినా ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. అన్నవరం భూముల విషయంలో తాము ఆందోళన చేస్తే ప్రభుత్వం వెనక్కు తగ్గిందన్నారు. మంగళగిరిలోనూ అలాగే జరిగిందన్నారు. ఈసారి నేరుగా తిరుమల వెంకన్న భూములకే వైసీపీ నేతలు ఎసరు పెట్టారని కన్నా లక్ష్మీనారాయణ ఆరోపించారు. వైసీపీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు దేవాలయ భూముల విషయంలో ఒకరకంగా మాట్లాడి, అధికారంలోకి వచ్చాక మరో మాట మాట్లాడుతుందని కన్నా లక్ష్మీనారాయణ చెప్పారు.

Tags:    

Similar News