టీడీపీనీ జాకీ పెట్టి లేపినా?

హైదరాబాద్ లో కూర్చుని చంద్రబాబు, లోకేష్ లు ఇద్దరూ ట్విట్టర్ లో ఇష్టమొచ్చినట్లు వ్యాఖ్యానిస్తున్నారని ఏపీ మంత్రి కన్నబాబు అన్నారు. పదోతరగతి పరీక్షలు విద్యార్థుల జీవితానికి అత్యంత [more]

Update: 2021-04-23 01:37 GMT

హైదరాబాద్ లో కూర్చుని చంద్రబాబు, లోకేష్ లు ఇద్దరూ ట్విట్టర్ లో ఇష్టమొచ్చినట్లు వ్యాఖ్యానిస్తున్నారని ఏపీ మంత్రి కన్నబాబు అన్నారు. పదోతరగతి పరీక్షలు విద్యార్థుల జీవితానికి అత్యంత ముఖ్యమైనవని తెలియదా? అని కన్నబాబు ప్రశ్నించారు. విద్యార్థుల జీవితాలకు ఇబ్బంది కరంగా మారుతుందనుకుంటే ఖచ్చితంగా ప్రభుత్వం పాజిటివ్ నిర్ణయం తీసుకుంటుందని కన్నబాబు చెప్పారు. ఎల్లో మీడియా కరోనాను సాకుగా చూపి ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తుందని కన్నబాబు ఆరోపించారు. పూర్తిగా దెబ్బతిన్న టీడీపీని జాకీ పెట్టి లేపడానికి ఎల్లోమీడియా ప్రయత్నిస్తుందని కన్నబాబు అన్నారు. అయినా ప్రజలు వైసీపీ ప్రభుత్వానికి అండగా ఉంటారని కన్నబాబు తెలిపారు.

Tags:    

Similar News