టీడీపీ వద్ద మూడు స్క్రిప్ట్ లు రెడీ గా ఉంటాయ్

ఎన్నికలు ఎప్పుడు జరిగినా తెలుగుదేశం పార్టీ వద్ద మూడు స్క్రిప్ట్ లు రెడీ ఉంటాయని వైసీపీ ఎమ్మెల్యే కాకాణి గోవర్థన్ రెడ్డి అన్నారు. పరిస్థితిని బట్టి వాటిలో [more]

Update: 2021-04-19 01:05 GMT

ఎన్నికలు ఎప్పుడు జరిగినా తెలుగుదేశం పార్టీ వద్ద మూడు స్క్రిప్ట్ లు రెడీ ఉంటాయని వైసీపీ ఎమ్మెల్యే కాకాణి గోవర్థన్ రెడ్డి అన్నారు. పరిస్థితిని బట్టి వాటిలో ఒకటిని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ప్రయత్నిస్తారని చెప్పారు. ఎన్నికలకు ముందు మత్స్యకారులకు 43 కోట్ల ప్యాకేజీ ప్రకటించామని లోకేష్ చేసిన ప్రకటనను కాకాణి గోవర్థన్ రెడ్డి తప్పుపట్టారు. తిరుపతి ఉప ఎన్నికల్లో పోలింగ్ శాతం తగ్గిపోవడానికి టీడీపీ నేతలే కారణమని, పోలింగ్ కేంద్రాలకు వచ్చిన ఓటర్లను టీడీపీ నేతలను భయభ్రాంతులకు గురి చేశారని కాకాణి గోవర్థన్ రెడ్డి అన్నారు. దొంగఓట్లు అనేది ఓటమి భయంతోనే చేసిన ఆరోపణ అని ఆయన కొట్టిపారేశారు.

Tags:    

Similar News