చంద్రబాబుకు కాకాణి సవాల్

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబుకు వైసీపీ ఎమ్మెల్యే కాకాణి గోవర్థన్ రెడ్డి సవాల్ విసిరారు. తాను ఇసుక కుంభకోణంలో ఉన్నానని వెంకటేశ్వరస్వామి ఎదుట ప్రమాణం చేయగలరా? అని [more]

Update: 2021-04-20 00:45 GMT

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబుకు వైసీపీ ఎమ్మెల్యే కాకాణి గోవర్థన్ రెడ్డి సవాల్ విసిరారు. తాను ఇసుక కుంభకోణంలో ఉన్నానని వెంకటేశ్వరస్వామి ఎదుట ప్రమాణం చేయగలరా? అని ఆయన ప్రశ్నించారు. అనవసర ఆరోపణలు చేస్తున్న వారిని తాను వదలబెట్టపోమని కాకాణి గోవర్థన్ రెడ్డి అన్నారు. చంద్రబాబు నీతి, నిజాయితీ ఉన్న పుట్టుక అయితే తాను అవినీతి ఆరోపణ చేసినట్లు నిరూపించాలని ఆయన డిమాండ్ చేశారు. పనికి మాలిన వెధవలంతా మాట్లాడేవారేనని కాకాణి గోవర్థన్ రెడ్డి ఎద్దేవా చేశారు. బ్లాక్ అండ్ వైట్ నాటి కాలం నాటి ఆరోపణలను మానుకోవాలని హితవు పలికారు.

Tags:    

Similar News