బ్రేకింగ్ : ఇద్దరు అభ్యర్థులను ప్రకటించిన కేసీఆర్

Update: 2018-11-18 11:41 GMT

పెండింగ్ లో ఉన్న రెండు స్థానాలకు తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత కె.చంద్రశేఖర్ రావు అభ్యర్థులను ప్రకటించారు. కోదాడ నుంచి బొల్లం మల్లయ్య యాదవ్, ముషీరాబాద్ అభ్యర్థిగా ముఠా గోపాల్ పేర్లను అధికారికంగా కేసీఆర్ ప్రకటించారు. ముషీరాబాద్ స్థానాన్ని సీనియర్ నేత నాయని నరసింహారెడ్డి తన అల్లుడికి ఇవ్వాలని పట్టుబడుతున్న సంగతి తెలిసిందే. అయితే నాయనిని బుజ్జగించిన కేసీఆర్ ఆ స్థానాన్ని ముఠాగోపాల్ కు కేటాయిస్తున్నట్లు ప్రకటించారు. నాయని చేతుల మీదుగానే ముఠాగోపాల్ బీఫారం అందుకోనున్నారు. మరోవైపు కోదాడలో పీసీసీ చీఫ్ ఉత్తమ కుమార్ రెడ్డి పద్మావతి బరిలో ఉన్నారు. ఆమెను ఢీకొనేందుకు బొల్లం మల్లయ్య యాదవ్ ను రంగంలోకి దించారు.

Similar News