రివ్యూ చేసుకోవాలన్న జేసీ

Update: 2018-12-12 12:28 GMT

తెలంగాణ ఎన్నికల ఫలితాలపై సమీక్ష చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని తెలుగుదేశం పార్లమెంటు సభ్యుడు జేసీ దివాకర్ రెడ్డి అభిప్రాయపడ్డారు. తెలంగాణ ఎన్నికల్లో విస్పష్ట ఫలితం రావడానికి కారణం అక్కడ రైతులు కేసీఆర్ కు అండగా నిలబడటం వల్లనేనని ఆయన అభిప్రాయపడ్డారు. సంచులు, పంచ్ లతో ఉపయోగం ఉండదని గుర్తుంచుకోవాలన్నారు. రైతు సంక్షేమ కార్యక్రమాలు చేపడితే ఎవరైనా తిరిగి అధికారంలోకి రావచ్చని కేసీఆర్ నిరూపించారన్నారు. అదే సందర్భంలో కేసీఆర్ ఆంధ్రప్రదేశ్ లో వేలు పెట్టాలని తాము కోరుకుంటున్నామన్నారు. ఆయన ఏపీరాజకీయాల్లో జోక్యం చేసుకుంటే తమకే ప్రయోజనమని జేసీ దివాకర్ రెడ్డి జోస్యంచెప్పారు.

Similar News