హైకోర్టులో జేసీ పిటీషన్.. అందువల్లనే నామినేషన్లను?

మున్సిపల్ ఎన్నిలలో తాము నామినేషన్లు వేసేందుకు అనుమతించాలని జేసీ ప్రభాకర్ రెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. నామినేషన్లు వేసే సమయంలో తమను నామినేషన్లు వేయకుండా వైసీపీ నేతలు అడ్డుకున్నారన్నారు. [more]

Update: 2021-02-25 07:39 GMT

మున్సిపల్ ఎన్నిలలో తాము నామినేషన్లు వేసేందుకు అనుమతించాలని జేసీ ప్రభాకర్ రెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. నామినేషన్లు వేసే సమయంలో తమను నామినేషన్లు వేయకుండా వైసీపీ నేతలు అడ్డుకున్నారన్నారు. జేసీ ప్రభాకర్ రెడ్డి తో పాటు మరో నలుగురు పిటీషన్ దాఖలు చేశారు. తమకు అనుమతిస్తే నామినేషన్లు తిరిగి వేస్తామని వారు హైకోర్టులో పిటీషన్ వేశారు. జేసీ ప్రభాకర్ రెడ్డి వేసిన పిటీషన్ పై విచారించిన హైకోర్టు విచారణను సోమవారానికి వాయిదా వేసింది.

Tags:    

Similar News