Jc prabhakar reddy : వైసీపీ పై జేసీ సంచలన వ్యాఖ్యలు

వైసీపీ ప్రభుత్వంపై మాజీ ఎమ్మెల్యే, తాడిపత్రి మున్సిపల్ ఛైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆంధ్రప్రదేశ్ లో పరిస్థితులు ఏమాత్రం బాగా లేవన్నారు. ప్రజలు [more]

Update: 2021-11-10 05:56 GMT

వైసీపీ ప్రభుత్వంపై మాజీ ఎమ్మెల్యే, తాడిపత్రి మున్సిపల్ ఛైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆంధ్రప్రదేశ్ లో పరిస్థితులు ఏమాత్రం బాగా లేవన్నారు. ప్రజలు నిత్యం కష్టాలు పడుతూనే ఉన్నారన్నారు. అనంతపురంలో విద్యార్థులపై లాఠీ ఛార్జి దారుణమని జేసీ ప్రభాకర్ రెడ్డి అభిప్రాయపడ్డారు. టీడీపీ నేతల కారణంగానే విద్యార్థులపై దాడి జరిగిందని రివర్స్ కేసులు పెట్టడమేంటని ఆయన ప్రశ్నించారు.

శాంతిభద్రతలు ఎక్కడ?

రాష్ట్రంలో శాంతి భద్రతల సమస్య ఉందని జేసీ ప్రభాకర్ రెడ్డి అభిప్రాయపడ్డారు. ప్రజలు ఎప్పుడు ఏం జరుగుతుందోనని ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకుని బతుకుతున్నారన్నారు. కుప్పంలో మాజీ మంత్రి అమర్ నాధ్ రెడ్డి అరెస్ట్ ను ఆయన ఖండించారు. అమర్ నాధ్ రెడ్డి భోజనం చేస్తుండగా పోలీసులు పట్టుకెళ్లడం దారుణమని జేసీ ప్రభాకర్ రెడ్డి అభిప్రాయపడ్డారు.

Tags:    

Similar News