మరోసారి వైసీపీకి చుక్కలు చూపించిన జేసీ

తాడిపత్రి మున్సిపల్ ఛైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి మరోసారి వైసీపీ పై పై చేయి సాధించారు. రెండు కో ఆప్షన్ సభ్యులను తన వారికే దక్కేలా జేసీ [more]

Update: 2021-08-27 07:43 GMT

తాడిపత్రి మున్సిపల్ ఛైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి మరోసారి వైసీపీ పై పై చేయి సాధించారు. రెండు కో ఆప్షన్ సభ్యులను తన వారికే దక్కేలా జేసీ రచించిన వ్యూహం ఫలించింది. ఇప్పటికే జేసీ ప్రభాకర్ రెడ్డి తాడిపత్రి మున్సిపాలిటీలో ఛైర్మన్, వైస్ ఛైర్మన్ పదవిని దక్కించుకున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈరోజు రెండు కో ఆప్షన్ సభ్యులను ఇండిపెండెంట్ సభ్యుల మద్దతుతో తన వారికే జేసీ ప్రభాకర్ రెడ్డి దక్కించుకోగిలిగారు. ఇక్కడ వైసీపీకి కేవలం 16 మంది సభ్యులు మాత్రమే ఉండటంతో జేసీకి వైసీపీ దాసోహం కాక తప్పడం లేదు. కో ఆప్షన్ సభ్యులను తమ వారిని ఎంపిక చేసుకోవాలనుకున్న వైసీపీ ఆశలు ఫలించలేదు.

Tags:    

Similar News