ఎంపీ జేసీ సంచలన కామెంట్స్ ఇవే

Update: 2018-04-10 06:56 GMT

టీడీపీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. హోదా కోసం చేస్తున్న ఆందోళనలతో ఉపయోగం లేదన్నారు జేసీ. ప్రధానిగా మోడీ ఉన్నంత కాలం ఆంధ్రప్రదేశ్ కు న్యాయం జరగదని చెప్పారు. పోరాటం చేయాల్సిందే తప్ప ఫలితం మాత్రం రాదని జేసీ తేల్చి చెప్పారు. చట్టాన్ని అమలు పర్చాల్సిన వ్యక్తే వెనక్కు పోతే ఇక ఎవరిని ప్రశ్నిస్తామన్నారు. తర్వాత ప్రభుత్వం ఇస్తే ఏమైనా ప్రత్యేక హోదా ఇవ్వొచ్చన్నారు. నాలుగేళ్లు కాళ్లు, గడ్డం పట్టుకుని బతిమాలినా మోడీ ఇవ్వలేదన్నారు. వచ్చే ఎన్నికల్లో ఎవరికీ పూర్తి స్థాయి మెజారిటీ రాదని జోస్యంచెప్పారు. వైసీపీ ఆమరణ దీక్షలన్నీ దొంగవన్నారు. రాజ్యసభ సభ్యులిద్దరి చేత రాజీనామా చేయిస్తే తాను కూడా తమ ఎంపీలందరితో రాజీనామా చేయిస్తానని జేసీ చెప్పారు. ఇద్దరు ఎంపీలను దాచిపెట్టి ఐదుగురిచేతనే ఎందుకు రాజీనామా చేయించావని జగన్ ను ప్రశ్నించారు. కక్ష సాధింపు కోసం మోడీ ఏ పనైనా చేస్తారన్నారు జేసీ.

Similar News