బ్రేకింగ్ : జగన్ పై జేసీ సంచలన కామెంట్స్

మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి వైఎస్ జగన్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబుకు సీఐడీ ఒక్క పేజీ నోటీసు మాత్రమే ఇచ్చిందన్నారు. కానీ జగన్ [more]

Update: 2021-03-16 07:16 GMT

మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి వైఎస్ జగన్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబుకు సీఐడీ ఒక్క పేజీ నోటీసు మాత్రమే ఇచ్చిందన్నారు. కానీ జగన్ కు ఇవ్వాల్సి వస్తే నోటీసులను లారీల్లో తీసుకు రావాల్సి ఉంటుందని జేసీ దివాకర్ రెడ్డి చెప్పారు. తాను దొనకండకాని, విశాఖను కానీ రాజధాని చేయాలని చంద్రబాబును కోరానన్నారు. ఒకసారి నిర్ణయం జరిగిన తర్వాత మార్చడం సరికాదని జేసీ దివాకర్ రెడ్డి అభిప్రాయపడ్డారు. రాష్టాన్ని విభజించి కాంగ్రెస్ పెద్ద తప్పు చేసిందన్నారు. తెలంగాణను ఇచ్చినా అక్కడ కాంగ్రెస్ కోలుకోలేదని జేసీ దివాకర్ రెడ్డి అన్నారు. దానికి కాలం చెల్లిందన్నారు. కాంగ్రెస్ నేతలంతా కలసి సీఎం అయిపోదామని పార్టీని చంపేశారన్నారు.

Tags:    

Similar News