హత్యాయత్నం తర్వాత మొదటిసారి మాట్లాడిన జగన్

Update: 2018-11-12 06:31 GMT

విశాఖపట్నం ఎయిర్ పోర్టులో తనపై హత్యాయత్నం ఘటన తర్వాత 17 రోజుల విశ్రాంతి తీసుకుని ప్రతిపక్ష నేత ఇవాళ పాదయాత్ర ప్రారంభించారు. విజయనగరం జిల్లా సాలూరు నియోజకవర్గంలో ఆయన పాదయాత్ర పున:ప్రారంభం అయ్యింది. పాపయ్యవలసలో రాజమండ్రికి చెందిన బీసీ సంఘం నేతలు జగన్ సమక్షంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా జగన్ వేదికపై మాట్లాడారు. వైసీపీలో చేరిన వారిని హృదయపూర్వకంగా ఆహ్వానించారు. అయితే, హత్యాయత్నం సంఘటనపై మాత్రం ఆయన మాట్లాడలేదు. బహిరంగసభలోనే జగన్ ఆ ఘటనపై మాట్లాడే అవకాశం ఉంది.

Similar News