వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వై.ఎస్.జగన్మోహన్ రెడ్డిపై ఏపీ మంత్రి నారా లోకేస్ విరుచుకుపడ్డారు. జగన్ కరప్షన్ కింగ్ ఆఫ్ ఇండియాగా ఘనత వహించారని ఎద్దేవా చేశారు. 13 కేసుల్లో ఏ1గా ఉన్న జగన్ కండీషనల్ బెయిల్ పై తిరుగుతున్నాడని, అటువంటి వ్యక్తి రాష్ట్రంలో నేరాలపై మాట్లాడుతుంటే విడ్డూరంగా ఉందన్నారు. కిడ్నాపర్లు, బెట్టింగ్ రాయుళ్లు, ఎర్రచెందనం స్మగ్లర్లు, భూకబ్జాదారులతో ఉన్న పార్టీకి జగన్ అధినేత అని గుర్తు చేశారు.