స్పీడ్ పెంచిన తెలంగాణ కాంగ్రెస్ నేతలు

కాంగ్రెస్ నేతలు కొంత స్పీడ్ పెంచారు. తెలంగాణలో పార్టీని బలోపేతం చేసే దిశగా పనిచేస్తున్నారు. పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి తో పాటు పార్టీ ప్రచార ఛైర్మన్ [more]

Update: 2021-07-25 07:00 GMT

కాంగ్రెస్ నేతలు కొంత స్పీడ్ పెంచారు. తెలంగాణలో పార్టీని బలోపేతం చేసే దిశగా పనిచేస్తున్నారు. పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి తో పాటు పార్టీ ప్రచార ఛైర్మన్ మధు యాష్కీ కూడా పార్టీని బలోపేతం చేసే దిశగా చర్యలు తీసుకుంటున్నారు. మధు యాష్కీ ఈరోజు కత్తి కార్తీక ను కలిశారు. తెలంగాణాలో ఫేమ్ ఉన్న కత్తి కార్తీకను మధు యాష్కీ కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించారు. ఇటీవల జరిగిన దుబ్బాక ఉప ఎన్నికల్లో కత్తి కార్తీక స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి డిపాజిట్లు కూడా దక్కించుకోలేకపోయారు. అయితే సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే బిగ్ బాస్ ఫేం కత్తి కార్తీకను మధుయాష్కీ పార్టీలోకి ఆహ్వానించారు.

Tags:    

Similar News