లోక్ సభను కుదిపేసింది

గాంధీ కుటుంబానికి ఎస్పీజీ భద్రతను ఉపసంహరించిన అంశం లోక్ సభను కుదిపేసింది. దీనిపై కాంగ్రెస్ సభ్యులు ఆందోళనకు దిగారు. గాంధీ కుటుంబానికి వాజపేయి ప్రభుత్వం భద్రత కల్పిస్తే [more]

Update: 2019-11-19 07:37 GMT

గాంధీ కుటుంబానికి ఎస్పీజీ భద్రతను ఉపసంహరించిన అంశం లోక్ సభను కుదిపేసింది. దీనిపై కాంగ్రెస్ సభ్యులు ఆందోళనకు దిగారు. గాంధీ కుటుంబానికి వాజపేయి ప్రభుత్వం భద్రత కల్పిస్తే నరేంద్ర మోదీ దానిని తొలిగించారని ఆరోపించారు. దీనిపై నరేంద్ర మోదీ సమాధానం చెప్పాలని కాంగ్రెస్ సభ్యులు డిమాండ్ చేశారు. గాంధీ కుటుంబానికి ఏదైనా జరిగితే బాధ్యులెవరు అని వారు ప్రశ్నించారు. ప్రభుత్వం నుంచి స్పందన రాకపోవడంతో లోక్ సభ నుంచి కాంగ్రెస్ సభ్యులు వాకౌట్ చేసింది. కాంగ్రెస్ తో పాటు డీఎంకే కూడా సభ నుంచి వాకౌట్ చేసింది.

Tags:    

Similar News