మోదీ గ్రాఫ్ పెరుగుతోంది…!!

ప్రధాని నరేంద్ర మోదీ గ్రాఫ్ క్రమంగా పెరుగుతున్నట్లు మరో సర్వే తేల్చి చెప్పింది. ప్రధానంగా బీహార్ లో మోదీ, నితీష్ కుమార్ హవా మామూలుగా లేదని ఇండియా [more]

Update: 2018-12-29 10:03 GMT

ప్రధాని నరేంద్ర మోదీ గ్రాఫ్ క్రమంగా పెరుగుతున్నట్లు మరో సర్వే తేల్చి చెప్పింది. ప్రధానంగా బీహార్ లో మోదీ, నితీష్ కుమార్ హవా మామూలుగా లేదని ఇండియా టుడే సర్వేలో తేలింది. బీహార్ లో ఇండియా టుడే సర్వే చేయగా అక్కడ మోదీ గ్రాఫ్ విపరీతంగా పెరగడం విశేషం. ఈ ఏడాది సెప్టెంబరు 58 శాతం ఉన్న మోదీ గ్రాఫ్, నవంబరు నెలకు 61 శాతానికి పెరిగింది. కేంద్ర ప్రభుత్వ పనితీరుపై కూడా దాదాపు 60 శాతం మంది సంతృప్తిని వ్యక్తం చేయడం విశేషం. ఇటీవలే మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్ ఘడ్ రాష్ట్రాల్లో బీజేపీ పరాజయం పాలవ్వడంతో సొంత పార్టీ నేతలే కస్సు మంటున్నారు. ఈ పరిస్థితుల్లో క్రమంగా మోదీ గ్రాఫ్ పెరుగుతుండటం ఆ పార్టీకి కొంత ఊరటనిచ్చే అంశమనే చెప్పాలి. అలాగే బీహార్ సీఎం నితీష్ కుమార్ కూడా తన పాపులారిటీని పెంచుకున్నారు. 49 శాతం మంది నితీష్ మంచి పాలన అందిస్తున్నారని చెప్పడం విశేషం.

Tags:    

Similar News