ముగ్గురిని చంపేశాడు.. కారణాలు మాత్రం?

హైదరాబాదులో దారుణం వెలుగుచూసింది. అక్క, బావ, చెల్లి ని అతి కిరాతకంగా చంపిన సంఘటన చాంద్రాయణగుట్ట పరిధిలో జరిగింది. కొన్నాళ్ల క్రితమే భార్యను చంపి హత్య కేసులో [more]

Update: 2020-06-30 03:05 GMT

హైదరాబాదులో దారుణం వెలుగుచూసింది. అక్క, బావ, చెల్లి ని అతి కిరాతకంగా చంపిన సంఘటన చాంద్రాయణగుట్ట పరిధిలో జరిగింది. కొన్నాళ్ల క్రితమే భార్యను చంపి హత్య కేసులో జైలుకు వెళ్లి బయటికి వచ్చిన అహ్మద్ సలాం ఈ మూడు హత్య లు చేసినట్లుగా పోలీసులు తెలిపారు . విందు కోసం పిలిచి అక్క బావ చెల్లని కిరాతకంగా చంపిన సంఘటన పైన చాంద్రాయణగుట్ట పోలీసులు విచారణ చేస్తున్నారు. హైదరాబాదులోని పాతబస్తీలో దారుణం చోటుచేసుకుంది. సొంత అక్కలను, బావను దారుణంగా హత్య చేశాడు.

ముగ్గురిపై దాడిచేసి….

పాతబస్తీ చాంద్రాయణగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలోని బార్కాస్ సలాల ప్రాంతంలో ఇద్దరు అక్కలు, బావ పై అహ్మద్ అనే యువకుడు దాడి చేశాడు. అహ్మద్ దాడిలో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు. విషయం తెలుసుకున్న చాంద్రాయణగుట్ట పోలీసులు, క్లూస్ టీం తో సహా సంఘటనా స్థలానికి చేరుకున్నారు. మూడు మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా మార్చురీకి తరలించారు. నిందితుడు అహ్మద్ పరారీలో ఉన్నాడు.పోలీసులు కేసు నమోదు చేసుకుని నిందితుడి గాలింపు చర్యల కోసం రెండు బృందాలతో పాటు సౌత్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు రంగంలోకి దిగారు

Tags:    

Similar News