ఈ ఐఏఎస్ ఆంధ్రాకు వెళ్లాలని…?

ఐఏఎస్ అధికారి శ్రీలక్ష్మి అమిత్ షాను కలిశారు. ఆమె ఢిల్లీలో హోంమంత్రి అమిత్ షాను కలిసి తన డిప్యూటేషన్ పై చర్చించినట్లు తెలుస్తోంది. తనను తెలంగాణ నుంచి [more]

Update: 2019-07-23 08:02 GMT

ఐఏఎస్ అధికారి శ్రీలక్ష్మి అమిత్ షాను కలిశారు. ఆమె ఢిల్లీలో హోంమంత్రి అమిత్ షాను కలిసి తన డిప్యూటేషన్ పై చర్చించినట్లు తెలుస్తోంది. తనను తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్ కు డిప్యూటేషన్ పై వెళ్లేందుకు అనుమతి ఇవ్వాలని శ్రీలక్ష్మి అమిత్ షాను కోరినట్లు సమాచారం. అలాగే తర్వాత వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డిని కూడా శ్రీలక్ష్మి కలిసి తన డిప్యూటేషన్ విషయమే చర్చించారు. శ్రీలక్ష్మి పార్లమెంటుకు రావడం విశేషం.

Tags:    

Similar News